Monday, May 6, 2024

బిఆర్ఎస్ నేతలకు కడుపునొప్పి ఎందుకు ?: సిఎం రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

ఆదిలాబాద్: కేస్లాపూర్ లోని నాగోబా ఆలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిఎంతో పాటు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, సీతక్క ప్రత్యేక పూజలు చేశారు. సిఎంకు ఎమ్మెల్యేలు వేడ్మ బొజ్జు, ప్రేమ్ సాగర్ సిఎస్ సాంతకుమారి స్వాగతం పలికారు. కేస్లాపూర్ స్వయం సహాయక సంఘాల మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సిఎం పరిశీలించారు. మహిళలు ఆత్మగౌరవంతో బతకాలనేదే మా ఉద్దేశమని సిఎం తెలిపారు. స్కూల్ యూనిఫామ్ లు కుట్టే అవకాశం స్వయం సహాయక బృందాలకే ఇస్తామని వెల్లడించారు.

మహిళలకు ఉచిత బస్సు రద్దు చేయాలని బిఆర్ఎస్ నాయకులు అంటున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తే బిఆర్ఎస్ నేతలకు కడుపునొప్పి ఎందుకు? అని ప్రశ్నించారు. గత కాంగ్రెస్ సిఎంలు మహిళలకు తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చారని గుర్తుచేశారు. మహిళలు ఆత్మగౌరవంతో ఉండి.. 10 మందికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. మహిళల కష్టాలు దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం రూ. 1200 ఉన్న గ్యాస్ సిలిండర్ త్వరలో రూ. 500కే ఇస్తామని చెప్పారు.

విద్యుత్ బిల్లులు కూడా ఎక్కువగా వస్తున్నయన్న సిఎం రేవంత్, 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందిస్తామని చెప్పుకొచ్చారు. మహిళలు గౌరవం నిలబెట్టేలా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. కేస్లాపూర్ లో మహిళా సంఘాల సభ్యులతో సిఎం రేవంత్ రెడ్డి ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల, కొండా సురేఖ, సీతక్క, కోమటి రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News