Saturday, May 4, 2024

బస్సు యాత్రలో రాహుల్, ప్రియాంక, ఖర్గే

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: మంగళవారం సాయంత్రం కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం కానుంది. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ ఠాక్రే అధ్యక్షతన సమావేశం కానుంది. ఈ సమావేశానికి టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, కమిటీ సభ్యులు హాజరుకానున్నారు. బస్సు యాత్ర విధివిధానాలు, పార్టీ అగ్రనేతల పర్యటనపైనే ప్రధాచ చర్చ జరిగింది. తిరగబడదాం-తరిమికొడదాం అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రియాంక గాంధీ ఈ నెల 15న బస్సు యాత్ర ప్రారంభించి, ప్రచారాన్ని మొదలు పెట్టనున్నారు. రెండు రోజులు బస్సు యాత్రలో ప్రియాంక గాంధీ పాల్గొననున్నారు. ఇప్పటికే ప్రకటించిన రైతు, యువ, ఎస్‌సి, ఎస్‌టి డిక్లరేషన్‌ను ప్రజల్లో తీసుకెళ్తోంది. ఈ నెల 18, 19 తేదీల్లో బస్సు యాత్రలో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. ఈ నెల 20, 21 తేదీల్లో బస్సు యాత్రలో ఎఐసిసి అధ్యక్షుడు ఖర్గే పాల్గొననున్నారు.

Also Read: World cup: ఇంగ్లాండ్ స్కోరు 59/0

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News