Sunday, May 5, 2024

ప్రజల్లో కాంగ్రెస్ విశ్వాసం కోల్పోతోంది: హరీష్

- Advertisement -
- Advertisement -

Congress loss people confidence in Telangana

 

హైదరాబాద్: సిఎం కెసిఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి టిఆర్‌ఎస్‌లో చేరికలు జరుగుతున్నాయని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. సంగారెడ్డి మున్సిపాలిటీలో కాంగ్రెస్‌కు చెందిన నలుగురు కౌన్సిలర్లు, 400 మంది కార్యకర్తలు మంత్రి హరీష్ రావు సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయన్నారు. కరోనాతో తెలంగాణ ఆదాయం తగ్గినా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని, కాంగ్రెస్ జాతీయ నాయకులు సిఎం కెసిఆర్‌ను అభినందిస్తున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అభివృద్ధిలో దేశానికే రోల్‌మోడల్ తెలంగాణ అని కొనియాడారు. కాళేశ్వరం ద్వారా సంగారెడ్డి, మహబూబ్‌సాగర్ లో చెరువు నింపుతామని, ప్రజల్లో కాంగ్రెస్ విశ్వాసం కోల్పోతోందని మంత్రి హరీష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంఎల్‌ఎ చింతా ప్రభాకర్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News