- Advertisement -
చండీగడ్ : హర్యానా రాజ్యసభ కాంగ్రెస్ ఎంపి దీపేందర్ సింగ్ హూడాకు ఆదివారం కరోనా పాజిటివ్ కనిపించింది. గత కొన్ని రోజులుగా ఎవరైతే తనతో సన్నిహితంగా ఉన్నారో వారంతా స్వీయ నిర్బంధం లోకి వెళ్లాలని, పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. దీపేందర్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. కాంగ్రెస్ శాసనసభ్యుడు శ్రీ కిషన్ హూడా ఏప్రిల్లో మృతి చెందడంతో ఉప ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఈ సందర్భంగా దీపేందర్ ఇటీవల బరోడా అసెంబ్లీ నియోజక వర్గంలో పర్యటించారు. హర్యానాకు చెందిన ఇతర పార్లమెంటు సభ్యులు కేంద్ర సహాయ మంత్రి క్రిషన్ పాల్ గుర్జార్, సంజయ్ భాటియా, బ్రిజేంద్రసింగ్, నయాబ్సింగ్ సైని, ఇటీవల కరోనా బాధితులయ్యారు. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తర్కు కూడా కరోనా పాజిటివ్ కనిపించింది.
Congress MP Deepender Hooda tests Corona
- Advertisement -