Sunday, April 28, 2024

భారత దౌత్యవేత్తకు పాక్ సమన్లు

- Advertisement -
- Advertisement -

Pakistan summons Indian diplomat

ఇస్లామాబాద్ : భారత హైకమిషన్‌కు చెందిన సీనియర్ దౌత్యవేత్తకు పాకిస్థాన్ ఆదివారం సమన్లు జారీ చేసింది. నియంత్రణ రేఖ వద్ద భారత దళాలు నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేసింది. నియంత్రణ రేఖ లోని రఖ్‌చిక్రి సెక్టార్‌లో విచక్షణా రహితంగా,ఎలాంటి హెచ్చరికలు లేకుండా భారత దళాలు కాల్పులు సాగించాయని ఒక పౌరుడు తీవ్రంగా గాయపడ్డాడని ప్రకటనలో ఆరోపించింది. నియంత్రణ రేఖ, సరిహద్దుల్లో భారత సైన్యాలు నిరంతరం జనం నివాస ప్రాంతాలను లక్షంగా చేసుకుని కాల్పులు సాగిస్తున్నాయని, ఈ ఏడాదిలో ఇంతవరకు నిబంధనల అతిక్రమణ సంఘటనలు 2158 వరకు జరిగాయని, 17 మంది మృతి చెందగా, 168 మంది తీవ్రంగా గాయపడ్డారని పాక్ ఆరోపించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News