Wednesday, May 1, 2024

సచివాలయం ముట్టడికి యత్నించిన కానిస్టేబుల్ అభ్యర్థులు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కానిస్టేబుల్ అభ్యర్థులు సచివాలయం ముట్టడికి యత్నించారు. 50మంది కానిస్టేబుల్ అభ్యర్థులు బుధవారం ఉదయం సచివాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకుపోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో సచివాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడంతో కానిస్టేబుల్ అభ్యర్థులు సచివాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి నివాదాలతో నిరసనకు దిగారు.

జీవో నంబర్ 46 రద్దు చేయాలని కానిస్టేబుల్ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. పాత బద్దతిలోనే నియామకాలను చేపట్టాలని, మెరిట్ ఆధారంగా పోస్టులను భర్తీ చేయాలని ఆందోళనకు దిగిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News