Tuesday, May 14, 2024

వనస్థలి బస్ టెర్మినల్‌కు అటవీ స్థలం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురంలో బస్ టెర్మినల్ నిర్మాణానికి వన్యప్రాణి మండలి ఆమోదం తెలిపింది. హరిణ వనస్థలికి చెందిన 1.354 హెక్టార్ల అటవీ భూమి (మూడు ఎకరాలు) నిబంధనలకు అనుగుణంగా మళ్లింపును అనుమతిని ఇచ్చామని రాష్ట్ర— అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకర ణ్ రెడ్డి తెలిపారు. మంత్రి అధ్యక్షతన సోమవారం అరణ్య భవన్‌లో రాష్ట్ర వన్యప్రాణి మండలి (వైల్డ్ లైఫ్ బోర్డు), మనుషులు జంతువుల మధ్య ఘర్షణ వాతావరణం తగ్గించే చర్యల సూచనల కమిటీ సమావేశాలు జరిగాయి. వన్యప్రాణులు, పులుల దాడుల్లో చనిపోయిన వారికి ఇచ్చే నష్టపరిహారాన్ని పెంచాలని రాష్ట్ర వన్యప్రాణి మండలి నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా అటవీ శాఖ నేతృత్వంలో అడవుల రక్షణ, వన్యప్రాణి సంరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలను సమావేశంలో పిసిసిఎఫ్, హెచ్‌ఓఎఫ్‌ఎఫ్ ఆర్.ఎం.డోబ్రియాల్ వివరించారు. రాష్ట్రంలో మొదటిసారి చేపట్టిన పులుల ఆవాసాల్లో ఉన్న మానవ ఆవాసాల తరలింపు (కవ్వాల్‌లో రెండు గ్రామాలు) ప్రక్రియ సజావుగా కొనసాగుతోందని తెలిపారు.

మనుషులు, వన్యప్రాణులకు మధ్య ఘర్షణ వాతావరణం నిరోధించేందుకు అవసరమైన చర్యలను కూడా కమిటీ చర్చించింది. వన్యప్రాణుల (పులులతో సహా) దాడుల్లో చనిపోయిన వారికి ఇచ్చే నష్టపరిహారాన్ని పెంచాలని నిర్ణయించారు. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న పరిహారం అధ్యయనం చేసిన తర్వాత బోర్డు ఈ కొత్త ప్రతిపాదనలు చర్చించింది. ప్రస్తుతం రూ.5 లక్షలు ఉన్న పరిహారాన్ని రూ.10 లక్షలకు పెంచుతూ ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపనున్నారు. సాధారణ గాయాలైతే వాస్తవ వైద్యం ఖర్చు (రూ.లక్ష మించకుండా), తీవ్రంగా గాయపడితే వైద్యానికి అయ్యే ఖర్చు (రూ.3 లక్షలకు మించకుండా), అంగవైకల్యం ఏర్పడితే లక్ష రూపాయల పరిహారం, పెంపుడు జంతువులు చనిపోతే వాస్తవ అంచనా, రూ.50 వేలకు మించకుండా, అలాగే పంట నష్టానికి ప్రస్తుతం ఎకరాకు రూ.6 వేలు ఉన్న పరిహారాన్ని రూ.7,500కు పెంచాలని, పండ్ల తోటలకు నష్టపరిహారం కూడా రూ.7,500 (గరిష్టంగా రూ.50 వేల కమిటీ ప్రతిపాదించింది.
రాష్ట్ర వన్యప్రాణి మండలి
పునర్ వ్యవస్థీకరణ ఆమోదాలు
రాష్ట్ర వన్యప్రాణి మండలిని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల (25.01.2023) జీవో నెంబర్ మూడు ద్వా రా పునర్ వ్యవస్థీకరించింది. ఆ తర్వాత జరిగిన తొలి సమావేశం ఇది. ఈ సమావేశంలో బోర్డు అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. గత బోర్డు సమావేశంలో 24 ప్రతిపాదనలు అటవీ అనుమతుల కోసం రాగా, 15 అప్లికేషన్లను పరిశీలించి అనుమతుల కోసం నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డుకు పంపామని, మిగతా తొమ్మిది రాష్ట్ర పరిధిలో ఉ న్నాయని అధికారులు తెలిపారు. తాజాగా మరో ఏడు ప్రతిపాదనలు సోమవారం సమావేశంలో బోర్డు ముందు ఉంచి చర్చించారు. హైదరాబాద్ వనస్థలిపురంలో బస్ టెర్మినల్ నిర్మాణానికి వన్యప్రాణి మండలి ఆమోదం తెలిపింది. హరిణ వసస్థలికి చెందిన 1.354 హెక్టార్ల అటవీ భూమి ని బంధనలకు అనుగుణంగా మళ్లింపును అనుమతిని ఇచ్చారు.

జాతీయ రహదారిలో విపరీతంగా పెరిగిన రద్దీ, ప్రయాణికుల సౌకర్యం కోసం ఈ టెర్మినల్ నిర్మాణం కానుంది. అయితే హరిణ వనస్థలి కోసం అవసరమైన అన్ని రక్షణాత్మక చర్య లు తీసుకోవాలని బోర్డు నిర్ణయించింది. శ్రీశైలం రహదారి విస్తరణ కోసం వచ్చిన ప్రతిపాదనను అమ్రాబాద్‌లో ఉన్న వన్యప్రాణి సంరక్షణను దృష్టిలో పెట్టుకుని బోర్డు తిరస్కరించింది. ఇతర రోడ్డు, ఇరిగేషన్, (కడెం పరిధిలో లక్ష్మీపూర్ లి ప్ట్, నాగార్జునసాగర్ పరిధిలో పెద్ద గుట్ట లిప్ట్) కే బుల్ పనులకు బోర్డు ఆమోదం తెలిపింది. వన్యప్రాణులు ప్రమాదంలో పడ్డప్పుడు కాపాడేందుకు అవసరమైన రెస్క్యూ టీమ్‌ల సంఖ్యను పెంచాలని నిర్ణయించారు. ఎంఎల్‌ఎలు కోనేరు కోనప్ప, సుధీర్‌రెడ్డి, వనమా వెంకటేశ్వరరా వు, సభ్యులు కోవ లక్ష్మి, రాఘవ, బానోతు రవికుమార్, అనిల్‌కుమార్, పిసిసిఎఫ్, హెచ్‌ఒఎఫ్‌ఎఫ్ ఆర్.ఎం. డోబ్రియాల్, పిసిసిఎఫ్ (ఎఫ్‌ఎసి) ఎం.సి పర్గెయిన్, అటవీశాఖ అడిషన ల్ సెక్రటరీ ప్రశాంతి, ఒఎస్‌డి శంకరన్, బోర్డు సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News