Saturday, April 27, 2024

వనస్థలిపురంలో రోడ్డుప్రమాదం: ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ వనస్థలిపురంలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. ఈ విషాద సంఘటన వనస్థలిపురం సుష్మ థియేటర్ సమీపంలో చోటుచేసుకుంది.  మృతులను కూకట్ పల్లికి చెందిన సతీశ్, వీరబాబుగా గుర్తించారు. వీరు ఇటుక లోడ్ ను ఖాళీ చేయటానికి వనస్థలిపురానికి వెళ్లినట్లు సమాచారం. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News