Monday, April 29, 2024

ఇండియా vs పాకిస్తాన్.. కాసేపట్లో డేవిస్ కప్ సమరం

- Advertisement -
- Advertisement -

పాకిస్తాన్ రాజధాని నగరంలోని ఇస్లామాబాద్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో నేటి నుంచి చారిత్రాత్మక డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ I ప్లే-ఆఫ్స్ టైలో భారత్-పాకిస్థాన్ తలపడనున్నాయి. ఉదయం 11:30 గంటల నుంచి ఇస్థామాబాద్ వేదికగా డేవిస్ కప్ ప్రారభం కానుంది. భారత అగ్రశ్రేణి సింగిల్స్ ప్లేయర్ సుమిత్ నాగల్ లేకుండానే భారత్ బరిలోకి దిగింది. భారత్ టెన్నిస్ జట్టు 60 ఏళ్ల తర్వాత పాకిస్థాన్ లో అడుగుపెట్టింది. పాకిస్థాన్‌తో భారత్ డేవిస్ కప్ చరిత్రలో పూర్తి ఆధిపత్యం కొనసాగిస్తోంది. రెండు దేశాలు గతంలో ఏడుసార్లు తలపడగా, ప్రతి ఒక్క మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధించి సత్తా చాటింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News