Sunday, May 5, 2024

ప్రతి ఆరు రోజులకు కేసులు రెట్టింపు: కేంద్ర ఆరోగ్య శాఖ

- Advertisement -
- Advertisement -

 

ఢిల్లీ: కరోనాపై కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. భారత్‌లో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 13,387 కాగా 437 మంది మృతి చెందారు. 24 గంటల్లో 1007 పాజిటివ్ కేసులు నమోదుకాగా 29 మంది చనిపోయారు. ఇప్పటి వరకు భారత్‌లో కరోనా నుంచి 1749 మంది కోలుకున్నారు. ప్రతి ఆరు రోజులకు కేసులు రెట్టింపవుతున్నాయని తెలిపింది. అన్ని రాష్ట్రాలకు ఐదు లక్షల టెస్టింగ్ కిట్స్ పంపిణీ చేశామన్నారు. ఇతర దేశాలతో పోల్చితే భారత్‌లో కరోనా వ్యాప్తి తక్కువగా ఉందని, 24 శాంపిల్స్‌లో ఒక పాజిటివ్ కేసు వస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా నుంచి 80 శాతం మంది కోలుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ 21,93,666 మందికి వ్యాపించగా 1,47,384 మంది చనిపోయారు. తెలంగాణలో కరోనా రోగుల సంఖ్య 706కు చేరుకోగా 18 మంది మృతి చెందారు.

 

Corona cases increased in India says Central Health

 

Corona cases increased in India says Central Health
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News