Thursday, May 16, 2024

హర్యానాలోని ఓ పాఠశాలలో 57 మంది విద్యార్థులకు కరోనా

- Advertisement -
- Advertisement -

Corona for 57 students in school in Haryana

 

చండీగఢ్: హర్యానాలోని కర్నాల్ జిల్లా కుంజుపురాలోని సైనిక పాఠశాల హాస్టల్‌లో 57మంది విద్యార్థులు కరోనా బారినపడ్డారు. సోమవారం హాస్టల్‌లోని ముగ్గురు విద్యార్థులు అనారోగ్యానికి గురి కాగా, వారికి పరీక్షలు జరపడంతో కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దాంతో, హాస్టల్‌లోని విద్యార్థులందరికీ పరీక్షలు నిర్వహించారు. మరో 54మంది విద్యార్థులు కరోనాబారిన పడ్డట్టు తేలింది. దాంతో,హాస్టల్‌ను మూసివేసినట్టు అధికారులు తెలిపారు. హాస్టల్ ప్రాంతాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించారు. వైద్య బృందాలు అక్కడికి చేరుకొని విద్యార్థులకు వైద్య సేవలందిస్తున్నాయి. హర్యానాలో గతేడాది డిసెంబర్‌లో 9 నుంచి 12 తరగతుల వరకు క్లాసులు ప్రారంభించారు. ఫిబ్రవరి 24 నుంచి 3నుంచి 5 తరగతులకు క్లాసులు ప్రారంభించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News