Monday, April 29, 2024

మంథనిలో విషాదం.. పురుగుల మందు తాగి దంపతుల ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి: జిల్లాలోని మంథని మండలంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. మండలంలోని నెల్లిపల్లి గ్రామంలో దంపతుల ఆత్మహత్య చేసుకున్నారు. మంగళవారం పురుగుల మందు తాగి భార్యభర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.

మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులను అశోక్, సంగీతగా పోలీసులు గుర్తించారు.ఆర్థిక ఇబ్బందులే దంపతుల ఆత్మహత్యకు కారణమని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News