Sunday, May 5, 2024

ఏడాది బాబుతో సహా దంపతుల ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Couple suicide in Palakoderu of West Godavari District

అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం కుముదవల్లి మంగళవారం విషాదం చోటుచేసుకుంది. అప్పుతీసుకున్న మహిళ పరారైందని దంపతులు ఏడాది కుమారుడితో సహా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను భీమవరం మండలం యనమదుర్రు చెందిన పరుశురామ్ (46), సావిత్రి(35), వెంకట శ్రీనివాస్ (1)గా పోలీసులు గుర్తించారు. స్థానికంగా ఉండే హైమావతి అనే మహిళకు రూ.46లక్షల వరకు పరుశురామ్ దంపతులు అప్పు ఇచ్చారు. మహిళ అప్పుతీర్చకుండా పరారవడంతోనే దంపతులు మనస్తాపానికి గురైన వారు ఆత్మహత్య చేసుకున్నారు.  స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద చాయాలు అలుముకున్నాయి. కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Couple suicide in Palakoderu of West Godavari District

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News