Monday, April 29, 2024

ప్రాణాలు తీసిన ఫుట్ బోర్డు ప్రయాణం

- Advertisement -
- Advertisement -

Five Killed in Bus Footboard Journey in Tamil Nadu

చెన్నై: తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. ఫుట్ బోర్టు ప్రయాణం ప్రాణాలు తీసింది. ప్రైవేట్ బస్సుకు విద్యుత్ తీగలు తగిలి ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. బస్సులో ప్రయాణిస్తున్న మరో 10 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. భాధితులను చికిత్స నిమిత్తం తంజావూర్ సర్కార్ దవాఖానకు తరలించారు. బస్సు ఫుట్ బోర్డుపై ప్రయాణం చేయడం వల్లే ప్రాణాలు కోల్పోయారని స్థానికులు తెలిపారు. ఈ దుర్ఘటన తంజావూర్ జిల్లా తిరువయ్యార్ సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

Five Killed in Bus Footboard Journey in Tamil Nadu

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News