Saturday, May 18, 2024

ముంబైలో కరోనా విలయతాండవం.. మహారాష్ట్రలో 2వేలకు చేరువగా పాజిటీవ్ కేసులు

- Advertisement -
- Advertisement -

corona

ముంబయి: మహారాష్ట్రలో మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) విలయతాండవం చేస్తోంది. ఎంతలా అంటే..దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రాలల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది.ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 1982 కరోనా కేసులు నమోదు కాగా..150 మంది మరణించారు. ఒక్క ముంబయిలోనే 1198 కరోనా కేసులు నమోదు కావడంతో ముంబయి వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రోజురోజుకీ కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. కరోనాను అరికట్టేందుకు లాక్‌డౌన్‌ ను ఏప్రిల్‌ 30 వరకు కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

Covid 19 Positive Cases raising to 1982 in Maharashtra

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News