Wednesday, May 1, 2024

రేవంత్, కనుగోలుపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి

- Advertisement -
- Advertisement -

ప్రచారం నుంచి రేవంత్‌ను తప్పించండి

ఎన్నికల ప్రవర్తనా నియమావళి కాంగ్రెస్ ఉల్లంఘిస్తుంది : ఎన్నికల సంఘానికి బిఆర్‌ఎస్ లీగల్ సెల్ ఫిర్యాదు

మన తెలంగాణ/ హైదరాబాద్ : కాంగ్రెస్ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తూ చట్టాన్ని ఎన్నికల సంఘాన్ని బేఖాతరు చేస్తోందని బిఆర్‌ఎస్ లీగల్ సెల్ బృందం పేర్కొంది. సోమవారం రాష్ట్ర ఎన్నికల సం ఘం అధికారులకు లీగల్ సెల్ నేత సోమభరత్‌కుమార్ ఆధ్వర్యంలో పిర్యాదు చేసింది. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ టిపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హింసను ప్రేరేపించేలా మాట్లాడుతున్నారని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసి నా దురదృష్టవశాత్తు ఈసీ ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడంతో మరింత రెచ్చిపోతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టానుసారంగా సభలపై కెసిఆర్ శిరచ్చేదం చేయాలని, తెలంగాణ సంస్కృతిని అవమానపరిచే భాష మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఎన్నికలం టే హింసను రెచ్చగొట్టడమేనా తొమ్మిదిన్నరేళ్లలో ఇ లాంటి ఘటనలు ఎప్పుడైనా జరిగాయని కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. ఇప్పటికే అనేకసార్లు ఈసీకి ఫిర్యాదు చేశామని అయినా ఎలాంటి చర్యలు తీసుకోవడం చాలా బాధాకరమని, రేవంత్ రెడ్డి ఏ ఉద్దేశంతో రాష్ట్రం లో హింసను ప్రోత్సహిస్తున్నారో ప్రశ్నలకు సమాధా నం చెప్పాలన్నారు.

సీఈఓకు అన్ని విషయాలు వివరంగా చెప్పామని వెంటనే చర్యలు తీసుకోపోతే వ్యవస్థ అరాచక శక్తుల చేతుల్లోకి పోతుందని కూడా విన్నవించినట్లు తెలిపారు. ఎన్నికల్లో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటామని సీఈఓ హామీ ఇచ్చినట్లు చెప్పారు.కాంగ్రెస్ చట్టాన్ని ఉ ల్లంఘించి అసత్యాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తోందని, ఎలాంటి అనుమతులు లేకుం డా ప్రచారం చేస్తున్నారని దొంగ ఛానళ్ల ముసుగులో దొంగ మనషులు బీఆర్‌ఎస్ పై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 28 ఛానళ్ల వివరాలు ఈసీకి ఇచ్చినట్లు వాళ్లపై చర్యలు తీసుకోవాలని కోరామని, కాంగ్రె స్ తెరవెనుక సునీల్ కనుగోలు లాంటి వాళ్లు చట్ట వ్యతిరేక పనులకు పాల్పడుతున్నారని అతనిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. రేవంత్ రెడ్డిపై క్రిమిన ల్ చర్యలు తీసుకోవడంతో పాటు ప్రచారానికి దూరం పెట్టి స్టార్ క్యాంపెయినర్‌గా తొలగించాలని పేర్కొన్నా రు. క్యూన్యూస్‌లో కాంగ్రెస్‌కు నేరుగా ప్రచారం చేస్తున్నారని, దీనితో పాటు స్టడీఐక్యూ ఐఏఎస్ యూట్యూ బ్ ఛానల్ ద్వారా కాంగ్రెస్ అసత్యాలు ప్రచారం చేస్తోందని వీటిపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News