- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో విద్యుత్కు ఎలాంటి అవాంతరాలు లేకుండా ఏర్పాట్లు చేశామని ట్రాన్స్కో జెన్కో సిఎండి ప్రభాకర్ రావు తెలిపారు. తెలంగాణలో పరిస్థితిని ప్రతీక్షణం మానిటర్ చేస్తున్నామన్నారు. కమర్షియల్, ఇండస్ట్రియల్, సిటీలో కరెంట్ వినియోగం కొంత తగ్గిందని, ప్రజలంతా ఇండ్లలోనే ఉంటున్నారు కాబట్టి డొమస్టిక్ వినియోగం పెరిగిందన్నారు. విద్యుత్ వినియోగం తగ్గడంతో బయట నుంచి విద్యుత్ కొనుగోలు కూడా తగ్గించామని చెప్పారు. మనకు బొగ్గు ఆయిల్ నిల్వలకు ఎలాంటి కొరత లేదన్నారు. విద్యుత్ ఉద్యోగులకు పోలీసులు ఎలాంటి ఆటంకం కలిగించొద్దని సూచించారు. పవర్ జనరేషన్ డిస్ట్రిబ్యూషన్, మెయింటెన్స్ ఉద్యోగులు వంద శాతం విధుల్లో ఉన్నారని వెల్లడించారు.
Current usage less in Hyderabad in Corona effect
Current usage less in Hyderabad in Corona affect
- Advertisement -