- Advertisement -
ముంబయి: తౌక్టే తుఫాను గుజరాత్ వైపు పయనిస్తోంది. గంటకు 20 కిలో మీటర్లతో వేగంతో కదులుతోంది. ఉదయం 5.30 గంటలకు అతి తీవ్ర తుఫాన్ గా మారే అవకాశం ఉంది. ముంబయికి పశ్చిమ నైరుతి దిశగా 160 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణించి తీవ్రత తగ్గించుకోనుంది. సాయంత్రం వరకు గుజరాత్ తీరాన్ని తాకనుంది. పోరుబందర్-మహువా మధ్య సాయంత్రం 5.30 నుంచి రాత్రి 8.30 గంటల మధ్య తీరం తాకే అవకాశం ఉంది. రాత్రి 8.30 నుంచి రాత్రి 11.30 గంటల మధ్య తౌక్టే తుఫాను తీరం దాటనుంది. తీరం వెంబడి ఉన్న 25 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
- Advertisement -