Saturday, May 4, 2024

టిటిడి ధ‌ర్మక‌ర్తల మండ‌లి స‌భ్యునిగా దాసరి కిరణ్ కుమార్ ప్రమాణస్వీకారం

- Advertisement -
- Advertisement -

 

తిరుపతి: టిటిడి ధ‌ర్మక‌ర్తల మండ‌లి స‌భ్యునిగా దాసరి కిరణ్ కుమార్ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. శ్రీ‌వారి ఆల‌యంలోని బంగారు వాకిలి చెంత ఆల‌య డిప్యూటీ ఇఒ రమేష్‌బాబు వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. దాసరి కిరణ్ కుమార్ శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. అనంత‌రం శ్రీ‌వారి తీర్థ ప్రసాదాలు, చిత్రప‌టాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో బోర్డు సెల్ డిప్యూటీ ఇఒ క‌స్తూరి బాయి, పేష్కార్ శ్రీ‌హ‌రి, పారుపత్తేదార్ తులసీప్రసాద్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

అనంతరం దాసరి కిరణ్ కుమార్ మాట్లాడారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సేవ కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తనకు బోర్డ్ సభ్యునిగా సేవ చేసుకునే భాగ్యం కల్పించినందుకు ఆయనకి పాదాభివందనం చేస్తున్నాను. ఈ సేవ కోసం దేశంలో ఎంతో మంది ప్రయత్నం చేస్తుంటారని, పదిహేనేళ్ళుగా ముఖ్యమంత్రి జగన్ తో పాటు ప్రయాణం చేస్తున్నానన్నారు.

తన విధేయతని గుర్తించి స్వామి వారి సేవ చేసుకునే అదృష్టం కలిగించిన ముఖ్యమంత్రి జగన్ ఋణం ఎప్పటికీ తీర్చుకోలేనన్నారు. స్వామి వారి ఆశీస్సులతో భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని మంచి సంక్షేమ పథకాలని జగన్ అమలు చేస్తున్నారని ప్రశంసించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఒక దైవ స్వరూపంగా అన్ని తరగతుల ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్నారని కొనియాడారు. స్వామి వారి ఆశీస్సులు, ప్రజల దీవెనతో జగన్ మళ్ళీ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని వివరించారు.

మచిలీపట్నం ఎంపి బాలశౌరి వల్లభనేని, టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఇఒ ధర్మారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. టిటిడిలోచాలా అనుభవంతో వున్న యంత్రాంగం వుంది. చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అద్భుతంగా ముందుకు తీసుకువెళుతున్నారని కొనియాడారు. తోటీ బోర్డ్ సభ్యులతో కలసి మరిన్ని మంచి బృహత్తర కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లడంతో పాటు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తన వంతు ప్రయత్నం చేస్తానని తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News