- Advertisement -
హైదరాబాద్: మహబూబ్నగర్ కలెక్టర్ కార్యాలయంలో వ్యక్తి మృతదేహం కలకలం రేపుతోంది. కలెక్టర్ ఆఫీసులోని మురుగు కాల్వలో వ్యక్తి మృతదేహం సోమవారం లభ్యమైంది. హత్య చేసి కాల్వలో పడేసినట్టు స్థానికులు భావిస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. వ్యక్తిని అక్కడే చంపి కాల్వలో పడేశారా..? లేదా ఎక్కడైనా హత్య చేసి ఇక్కడికి తెచ్చి పడేశారా?.. అనే దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Dead Body found at Mahabubnagar Collector Office
- Advertisement -