Tuesday, May 7, 2024

రైలు పట్టాలపై మృతదేహం… ఆత్మహత్య అనుకున్నారు… కానీ

- Advertisement -
- Advertisement -

Dead body found on railway track

 

భోపాల్: రైల్వే ట్రాక్‌పై మృతదేహం కనిపించడంతో సదరు వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారని అందరూ భావించారు. కానీ మృతదేహంపై గాయాలు ఉండడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో దర్యాప్తు చేయగా ఓ మహిళతో వివాహేతరం సంబంధం పెట్టుకోవడంతో అతడిని ఆమె భర్త చంపేసి రైలు పట్టాలపై మృతదేహం పడేసిన సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బనేసింగ్(45) అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి శాంఘర్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. హుకుమ్ సింగ్ భార్యతో బనేసింగ్ వివాహేతర సంబంధ పెట్టుకున్నాడు. ఈ విషయం హుకుమ్ సింగ్‌కు తెలియడంతో అతడిని చంపాలని నిర్ణయం తీసుకున్నాడు. హుకుమ్ సింగ్ తన తండ్రి, సోదరుడు, మరో వ్యక్తితో కలిసి బనేసింగ్‌ను హత్య చేశారు. మృతదేహాన్ని హన్స్‌పూరా గ్రామ సమీపంలోని రైల్వేట్రాక్‌పై పడేశారు. మృతదేహం పైనుంచి రైళ్లు వెళ్లడంతో నుజ్జునుజ్జుగా మారడంతో పాటు శవం మూడు భాగాలు చెల్లాచెదురుగా పడిపోయింది. స్థానికుల సమాచారం మేరకు రైల్వే పోలీసులు, స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పంచానామా చేశారు. తొలుత సదరు వ్యక్తి ఆత్మహత్య చేసుకొని ఉంటాడని భావించారు. కానీ మృతదేహంపై గాయాలు ఉండడంతో ఆత్మహత్య కాదని హత్య చేసి ఇక్కడ పడేసి ఉంటారని పోలీసులు భావించారు. పోలీసులు కేసు నమోదు చేసి బనేసింగ్ గురించి వివరాలు సేకరించగా ఒక మహిళతో వివాహేతరం సంబంధ పెట్టుకున్నట్టుగా గుర్తించారు. కానీ హుకుమ్ సింగ్ కుటుంబ సభ్యులు కనిపించకపోవడంతో పోలీసులకు వాళ్లే హత్య చేసి ఉంటారని బలంగా నమ్మారు. పోలీసులు గాలింపు చర్యలు జరపగా నలుగురు దొరికారు. వెంటనే వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News