Saturday, May 4, 2024

కుప్పకూలిన బిపిన్ రావత్ హెలికాప్టర్.. నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

Army Helicopter Crashes in Tamil Nadu

చెన్నై: తమిళనాడులోని కూనూరు వద్ద ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి సులుర్ కు వెళ్తున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఐఎఎఫ్ ఎమ్ఐ-17వి5 ఆర్మీ హెలికాప్టర్ కూనూరు సమీపంలోని నీలగిరి కొండల్లో కూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మిగతావారు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను విల్లింగ్టన్ ఎయిర్ బేస్ కు తరలించారు. ప్రమాద సమయంలో హెలికాప్టర్ లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆయన కుటుంబ సభ్యులు, ఉన్నతాధికారులతో సహా మొత్తం 14మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ప్రమాద స్థలం నుంచి రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే, బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక గల్లంతైనట్లు సమాచారం. ఈ ఘటనపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దర్యాప్తుకు ఆదేశించింది. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Army Helicopter Crashes in Tamil Nadu

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News