Monday, April 29, 2024

ప్రియుడితో వెళ్లిన బాలిక… ఐదుగురు అత్యాచారం…

- Advertisement -
- Advertisement -

Mumbai woman who was raped and dies

హైదరాబాద్: సుల్తాన్ బజార్ అదృశ్యమైన బాలికపై మేడిపల్లిలో ఐదుగురు స్నేహితులు ఆమెపై అత్యాచారం చేసిన సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సుల్తాన్ బజార్ ఉండే మైనర్ బాలిక తన ప్రియుడితో కలిసి నవంబర్ 30న బయటకు వెళ్లింది. నవంబర్ 30 రాత్రి బాలిక ఇంటికి రాకపోవడంతో ఆమె తల్లితండ్రి సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరపగా డిసెంబర్ 3న బాలికను గుర్తించారు. బాలికను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తనపై ఐదుగురు అత్యాచారం చేశారని చెప్పింది. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News