Saturday, April 27, 2024

లైవ్ లో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య….

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా బివి నగర్‌లో డిగ్రీ విద్యార్థిని లైవ్ లో ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం సృష్టిస్తోంది. రమ్య అనే విద్యార్థిని సెల్ఫీ వీడియో తీసుకొని చనిపోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రమ్య శనివారం తెల్లవారుజామున ఇంట్లో నుంచి బయటకు రాకపోవడంతో తల్లిదండ్రులు డోర్ బలవంతంగా ఓపెన్ చేసి చూడగా ఫ్యాన్ కు ఉరేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకునే ముందు వీడియో తీసుకుందని పోలీసులు తెలిపారు. తోటి విద్యార్థుల వేధింపులే తన కూతురు ఆత్మహత్యకు కారణమని పోలీసులకు రమ్య తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం లైవ్ సూసైడ్ సంచలనం సృష్టిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News