ఢిల్లీ: స్నేహితురాలు మరోక వ్యక్తితో చనువుగా ఉంటుందని ఆమెతోపాటు తల్లిని కూడా బాయ్ ఫ్రెండ్ హత్య చేసిన సంఘటన తూర్పు ఢిల్లీలో వసుంధర ఎన్క్లేవ్లో జరిగింది. దీంతో బాయ్ ఫ్రెండ్ను రాజస్థాన్లోని జైపూర్లో పోలీసులు అరెస్టు చేశారు. ఈ హత్యలో బాయ్ ఫ్రెండ్కు సహకరించిన మరొక వ్యక్తి పరారీలో ఉన్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సమ్రిత (25) అనే అమ్మాయి తన తల్లి సుమితా మారీతో కలిసి జీవిస్తోంది. సుమిత్ ఎన్జిఒ ఆఫీస్లో పని చేస్తుండగా సమిత్ర మాత్ర ఫైవ్ స్టార్ హోటల్లో పని చేస్తోంది. సమిత్రకు విక్రాంత్ నగర్ అనే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. విక్రాంత్తో స్నేహం చేయకుండా మరోక వ్యక్తితో సమ్రిత చనువుగా ఉండడం అతడికి నచ్చలేదు. దీంతో వారిందరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. విక్రాంత్ తన స్నేహితుడు ప్రయాగ్తో కలిసి ఆమెను హత్య చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. ఆదివారం సాయంత్రం సమిత్ర రాకకోసం మనసారా ఆపార్ట్మెంట్ వద్ద విక్రాంత్, ప్రయాగ్ ఎదురుచూస్తున్నారు. సమిత్ర ఇంట్లోకి వెళ్లగానే ఇద్దరు ఆమె ఇంట్లోకి వెళ్లి గొడవకు దిగారు. దీంతో సమ్రితను కత్తులతో పొడిచి అడ్డుగా వచ్చిన తల్లి సుమిత్రాను కూడా కత్తిలతో పొడిచి ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. సోమవారం ఉదయం ఇంటికి తాళం ఉండటం పక్కింటి వాళ్లు గమనించారు. స్థానికుల సహాయంతో ఇంటి డోర్ తెరవడంతో ఇద్దరు రక్తపు మడుగులో కనిపించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి సిసి కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేశారు. అపార్ట్మెంట్ పరిసర ప్రాంతాల్లో విక్రాంత్, ప్రయాగ్ తచ్చాడినట్టుగా గుర్తించారు. విక్రాంత్ను రాజస్థాన్లోని జైపూర్లో బస్సులో ప్రయాణిస్తుండగా పట్టుకున్నారు. ప్రయాగ్ మాత్రం పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. సమ్రితా ఇంటి నుంచి అపహరించిన ఆభరణాలు, ఫోన్, నగదును పోలీసులు విక్రాంత్ నుంచి స్వాధీనం చేసుకున్నారు.