- Advertisement -
న్యూఢిల్లీ : ఇంతవరకు కరోనాను గుర్తించే ఆర్టిపిసిఆర్ పరీక్షకు ప్రైవేట్ ల్యాబ్లో రూ.2400 చెల్లిస్తుండగా, ఇకనుంచి రూ.800 కే జరిగేలా ఢిల్లీ ప్రభుత్వం భారీగా ధరలు తగ్గిస్తూ నిర్ణయించింది. ఈమేరకు అన్ని ప్రైవేట్ ల్యాబ్లకు ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ ఇంటికి వచ్చి శాంపిల్ సేకరిస్తే రూ.1200 గా ధర నిర్ణయించింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ పరీక్ష ఉచితమని, అయితే దీనికోసం ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లేవారికి రూ.800 కే పరీక్ష జరిగేలా తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సోమవారం ట్విటర్ ద్వారా వెల్లడించారు. లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ ఆధ్వర్యాన సోమవారం జరిగిన ప్రకృతి వైపరీత్యాల నివారణ యాజమాన్య (డిడిఎంఎ) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్, డిప్యూటీ సిఎం శిశోడియా, తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
- Advertisement -