- Advertisement -
దుబాయ్: యూఎఇ వేదికగా సాగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్వంటీ20 టోర్నమెంట్ తుది అంకానికి చేరుకుంది. మంగళవారం జరిగే తుది సమరంలో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్తో తాడో పేడో తేల్చుకునేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ సిద్ధమైంది. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. నాలుగు సార్లు టైటిల్ ముద్దాడిన ముంబై.. ఎట్టకేలకు పదమూడో సీజన్లో ఫైనల్ చేరి తొలి ఐపిఎల్ టైటిల్పై కన్నేసిన ఢిల్లీ రసవత్తర పోరుకు సన్నద్ధమయ్యాయి. లీగ్ దశలో ఢిల్లీపై రెండు మ్యాచ్ల్లో విజయం సాధించిన ముంబై తొలి క్వాలిఫయర్లోనూ చిత్తుగా ఓడించింది. రెండు జట్లలోనూ స్టార్ ఆటగాళ్లు ఉండడంతో ఫైనల్ సమరం నువ్వానేనా అన్నట్టు సాగడం ఖాయం.
- Advertisement -