లక్నో: ఉత్తరప్రదేశ్ డియోరియా జిల్లా సదర్కు చెందిన బిజెపి ఎంఎల్ఎ జనమేజయ సింగ్ (75) కన్నుమూశారు. పేస్మేకర్ అమరుస్తుండగా గుండెపోటుతో ఆయన చనిపోయినట్టు మనోహర్ లోహియా ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఆయనను చికిత్స నిమిత్తం తొలుత సివిల్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం లోహియా ఇనిస్టిట్యూట్కు షిఫ్ట్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. జనమేజయ మృతికి యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు. తన నియోజకవర్గాన్ని అభివృద్ధి పరిచేందుకు ఆయన ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. సమాజంలోని బడుగుబలహీన వర్గాల అభివృద్ధికి శ్రమించారని ప్రశంసించారు. జనమేజయ సింగ్ మృతి పట్ల పలువురు నాయకులు సంతాపం ప్రకటించారు.
Deoria BJP MLA Janmejay Singh passed away
- Advertisement -