Tuesday, April 30, 2024

అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి

- Advertisement -
- Advertisement -

పర్వతగిరి: నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలపడమే లక్షమని వర్ధన్నపేట ఎమ్మెల్యే, బిఆర్‌ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఆరూరి రమేశ్ అన్నారు.బుధవారం పర్వతగిరిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పర్వతగిరి మండల ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల అధికారులతో ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పర్వతగిరి మండల పరిధిలో పెండింగ్‌లో ఉన్న పనులు, ఇంకా చేపట్టాల్సిన పనులపై ప్రజాప్రతినిధులు, అధికారులతో చర్చించారు. అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వీలైనంత తొందరగా పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నియోజకవర్గంలో గ్రామాలు, డివిజన్లలో ప్రజల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తూ పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నామన్నారు. ప్రభుత్వం అందించే నిధులతో గ్రామాలను అభివృద్ధికి ప్రతీకలుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అర్హులైన ప్రతీ ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ప్రతీ నిత్యం కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News