Monday, April 29, 2024

లక్ష్మీనరసింహుని నిత్యపూజలో భక్తులు

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్న భక్తజనులు శ్రీవారి ఆలయంలో జరుగు నిత్యపూజలలో పాల్గొని తమ మోక్కుబడులను చెల్లించుకున్నారు. శనివారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఆలయం తెలిరిచిన ఆర్చకులు సుప్రభాత సేవతో ఆలయ పూజలకు శ్రీకారం చుట్టారు. శ్రీ స్వామివారి దర్శనార్ధం తరలివచ్చిన భక్తులు తెల్లవారు జామునుండే యాదాద్రి కొండకు చేరుకొని శ్రీవారి దర్శనముతోపాటూ ఆలయంలో జరిగిన నిత్యపూజలు అభి షేకం,అర్చన,సుదర్శన నారసింహ హో మం, నిత్యకల్యాణం,సువర్ణ పుష్పార్చన,వెండి జోడిసేవ,దర్బార్ సేవ తోపాటూ శ్రీ వారి సన్నిధిలో జరుగు శ్రీ సత్యనారాయణ వ్రతపూజలలో భక్తులు పాల్గొని దర్శించుకున్నారు. కొండపైన కోలువుదీరిని శ్రీ పర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి శివాలయంలో శివదర్శనముతోపాటూ, కొండికింద శ్రీ పాతలక్ష్మీనరసింహుని భక్తులు దర్శించుకొని పూజలు నిర్వహించారు.

ఇక పై శనివారం గిరి ప్రదక్షణలకు శ్రీకారం..
యాదాద్రి శ్రీలక్ష్మీనరసిఃహుడి క్షేత్రంలో యాదాద్రి కొండ చూట్టు భక్తులు గిరి ప్రదక్షణ చేయడం అనాదిగా వస్తూంది. శ్రీవారి జన్మనక్షత్రం స్వాతి పర్వదినములో భక్తులు అధిక సంఖ్యలో గిరి ప్రదక్షణ చేయడం ప్రత్యకతగా ఉంది. దేవస్థానము ఆధ్వర్యంలో శ్రీ స్వామివారికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో ప్రతి శనివారం గిరి ప్రదక్షణ నిర్వహించాలని శ్రీకారం చుట్టారు. మొదటి రోజున ఆలయ ఈవో గీత,ఆలయ అధికారులు, ఉద్యోగ సిబ్బంది, స్థానికులు, భక్తులు పాల్గొన్నారు.

ఆలయ నిత్యరాబడి…
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయ నిత్యరాబడిలో భాగంగా శనివారం రూ.29,05,119 ఆదా యం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రసాద విక్రయం,అర్జిత సేవలు,విఐపి దర్శనము,కొండపైకి వాహనాల అనుమతి,పాతగుట్ట, శివాలయం ఇతర శాఖల నుండి ఆలయ నిత్యరాబడి సమకురినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News