Tuesday, May 14, 2024

పొలిటికల్ డ్రామా ప్రారంభం

- Advertisement -
- Advertisement -

ధర్మ, పవి హీరోహీరోయిన్లుగా శ్రీలక్ష్మీ నరసింహ మూవీ మేకర్స్ పతాకంపై తెరకెక్కనున్న నూతన చిత్రాన్ని ప్రవీణ్‌రెడ్డి నిర్మిస్తున్నారు. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో ఆలోచింపచేసే కథగా రూపొందుతున్న ఈ చిత్రంతో సినిమాటోగ్రాఫర్ శ్యామ్ తుమ్మలపల్లి దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ మూవీ పూజా కార్యక్రమాలు సోమవారం హైదరాబాద్‌లో జరిగాయి. మొదటి సన్నివేశానికి దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల క్లాప్ కొట్టగా మాగంటి గోపీనాథ్ కెమెరా స్విచాన్ చేశారు. హీరో శ్రీవిష్ణు, దర్శకుడు విఎన్ ఆదిత్య స్క్రిప్ట్‌ను మేకర్స్‌కు అందజేశారు. ఈ కార్యక్రమానికి నిర్మాత వివేక్ కూచిబొట్ల హాజరయ్యారు. ఈ నెల చివరి వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. ఈ చిత్రానికి సంగీతంః గౌర హరి, సినిమాటోగ్రఫీః కేశవ, కథః కిషోర్ శ్రీకృష్ణ, ఎడిటర్‌ః జెస్విన్ ప్రభు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News