Wednesday, May 1, 2024

అమీన్‌పూర్ బాధితులకు న్యాయం చేయాలని ధర్నా

- Advertisement -
- Advertisement -

ముషీరాబాద్ : సత్యం స్కాం, అగ్రిగోల్డ్ బాధితులకు న్యా యం చేసినట్టుగానే హైదరాబాద్ శివారు ప్రాంతంలోని అమీన్‌పూర్ సాహితీ శర్వాణీ ఎలైట్ ప్రాజెక్టు బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలని సాహితీ శర్వాణి ఎలైట్ అమీన్‌పూర్ ప్రాజెక్టు బాధితుల సంఘం నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. అమీన్‌పూర్ సాహితీ శర్వాణీ ఎలైట్ ప్రాజెక్టులో డబ్బు చెల్లించి మోసపోయిన బాదితులు ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో ఆదివారం ధర్నా చేపట్టారు. బాధితుల సంఘం నాయకులు కిషన్‌రెడ్డి, మధుకర్ మాట్లాడుతూ సాహితీ శర్వాణీ ఎలైట్ ప్రాజెక్టు వెంచర్‌లో ప్లాట్ కొనుగోలు చేసేం దుకు డబ్బు చెల్లించిన వారికి డబుల్ రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపించారు.

డ బుల్ రిజిస్ట్రేషన్‌తో అమాయకులను మోసగించిన వారిపై రాష్ట్ర ప్రభుత్వం త గిన చర్యలు తీసుకోవాలని, వెంచర్ నిర్వాకులపై కేసులు నమోదు చేయాల ని కోరారు. ఈ వెంచర్‌లో చోటు చేసుకున్న అవకతవకలు, అమాయకులను మోసగించిన వారిపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ వేసి ప్లాట్ కోసం డబ్బులు చెల్లించిన వారి వివరాలను సేకరించి, చెల్లించిన మొత్తాన్ని తిరిగి చెల్లించే ప్ర క్రియను చేప ట్టాలన్నారు. సాహితీ శర్వాణీ ప్రాజెక్టు బాధితులకు తగిన న్యా యం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. లేనిపక్షంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బా ధితుల సంఘం నాయకులు హనుమంతరావు, వంశీ, ఫణీంద్ర, రమణ, న రేంద్రబాబు, భీమేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News