Friday, May 3, 2024

దాంపత్య అత్యాచారంపై ఢిల్లీ హైకోర్టులో భిన్నాభిప్రాయాలు

- Advertisement -
- Advertisement -

Disagreements in Delhi High Court over marital rape

సుప్రీం కోర్టుకు అపీలు చేసుకోవాలని సూచన

న్యూఢిల్లీ : దాంసతకచ అత్యాచారాన్ని నేరంగా పరిగణించడంపై ఢిల్లీ హైకోర్టు బుధవారం ఏకాభిప్రాయం వ్యక్తం చేయలేకపోయింది. ధర్మాసనం లోని ఇద్దరు న్యాయమూర్తులు పరస్పర ం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో ఈ అంశంపై సుప్రీం కోర్టుకు అపీలు చేసుకోవాలని సర్టిఫికెట్ ఇచ్చారు. భారత శిక్షాస్మృతి (ఐపిసి) లోని సెక్షన్ 375 ప్రకారం అత్యాచారం నేరం. ఈ సెక్షన్‌కు రెండో మినహాయింపు ప్రకారం భర్త , మైనర్ కానటువంటి తన భార్యతో బలవంతంగా లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడం నేరం కాదు. భార్యకు ఇష్టం లేని సమయంలో ఆమెతో శృంగారంలో పాల్గొన్న భర్తకు అత్యాచార నేరం నుంచి మినహాయింపు ఉంది. ఈ మినహాయింపు రాజ్యాంగ విరుద్ధమని జస్టిస్ రాజీవ్ షక్దర్ తన తీర్పులో పేర్కొన్నారు. ఆయనతో తాను ఏకీభవించలేనని జస్టిస్ హరిశంకర్ చెప్పారు. ఈ అంశంలో ప్రధానమైన శాసన ప్రశ్నలు ఇమిడి ఉన్నాయని , దీనిపై సుప్రీం కోర్టులో అపీలు చేయవచ్చని ఈ ఇద్దరు న్యాయమూర్తులు సర్టిఫికెట్ మంజూరు చేశారు. ఆర్‌ఐటి ఫౌండేషన్, ఆలిండియా డెమొక్రాటిక్ విమెన్స్ అసోసియేషన్ ఈ పిటిషన్లు దాఖలు చేశాయి.

పిటిషనర్ల వాదన ప్రకారం , వివాహిత మహిళపై ఆమె భర్త లైంగిక దాడి చేసినప్పుడు , ఆ మహిళ పట్ల వివక్షకు ఈ సెక్షన్ లోని మినహాయింపు నిబంధన దోహదపడుతోంది. అందువల్ల ఈ నిబంధన రాజ్యాంగ బద్ధమైనది కాదు. ఈ మినహాయింపును రద్దు చేయాలని కోరుతూ దాఖలైన ఈ పిటిషన్లపై విస్తృత స్థాయిలో వాదనలను విన్న హైకోర్టు ఫిబ్రవరి 21న తన తీర్పును రిజర్వు చేసింది. గర్ల్ ఫ్రెండ్ లేదా సహజీవనం చేసే భాగస్వామి అంగీకారం తెలియజేయనప్పుపడు ఆమెతో బలవంతంగా సెక్స్ చేయడం నేరమని జస్టిస్ షక్దర్ చెప్పారు. వారి మధ్య ఉండే బాంధవ్యం దీన్ని ప్రత్యేక స్థాయిలో ఉంచబోదన్నారు. మహిళ అంటే మహిళే అని చెప్పారు. అయితే జస్టిస్ హరిశంకర్ మాత్రం ఒకరినొకరు పెళ్లి చేసుకున్నవారికి , వివాహం చేసుకొనని వారికి మధ్య ఉండే ప్రామాణిక వ్యత్యాసాన్ని వివరించారు.

లైంగిక సంబంధాలను ఆశించే హక్కు వివాహం చేసుకున్న ఇరు పక్షాలకు ఉందన్నారు. కానీ అలాంటి హక్కు వివాహం చేసుకొనని వారికి లేదన్నారు. కోర్టు నియమించిన అమికస్ క్యూరీ తీరును కూడా తప్పుబట్టారు. భార్య సమ్మతి తెలియజేయాలని మితిమీరి ఎందుకు నొక్కి వక్కాణిస్తున్నారని ప్రశ్నించారు. దాంపత్య అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలంటూ దాఖలైన పిటిషన్లపై స్పందించేందుకు కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు ఫిబ్రవరిలో రెండు వారాల గడువు ఇచ్చింది. ఈ విచారణను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. తాను అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు దీనికి సంబంధించిన ఓ లేఖను రాసినట్టు తెలిపింది. ఈ అంశంపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు స్పందించేవరకు విచారణను నిలిపివేయాలని కోరింది. అందుకు హైకోర్టు అంగీకరించలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News