Friday, April 26, 2024

కుక్క తెచ్చిన పంచాయతీ… గుండెపోటుతో మహిళ మృతి

- Advertisement -
- Advertisement -

Dog

 

ముంబయి: కుక్క విషయంలో జరిగిన గొడవలో ఓ మహిళ ప్రాణాలు విడిచిన సంఘటన మహారాష్ట్రలోని కల్యాణ్ నగర్ ప్రాంతం దొంబివ్లి జరిగింది.  వీధి కుక్క విషయంలో నలుగురు మహిళలు ఓ మహిళపై దాడి చేయడంతో ఆమె గుండె పోటుతో మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. నాగమ్మ అనే వితంతువు తన కూతురుతో కలసి మంపడాలోని చావ్లా ప్రాంతంలో ఉంటుంది. తన కూతురు ఇంటి పనులు చేసుకుంటూ ఆమె ఒక వీధి కుక్కను పెంచుకుంది. వీధి కుక్క స్థానికులు కనపడగానే భౌభౌ మంటూ మొరగడంతో పలుమార్లు ఆమెపై వాళ్లు ఆగ్రహం వ్యక్తం చేసేవారు. స్థానికంగా ఉండే నలుగురు మహిళలు కుక్క విషయంలో నాగమ్మతో గొడవకు దిగారు. దీంతో మంగమ్మపై నలుగురు మహిళలు దాడి చేయడంతో స్థానికులు పోలీస్ స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చిన తరువాత అదే రాత్రి గుండె పోటుతో నాగమ్మ చనిపోయింది. నలుగురు మహిళలు తన తల్లి ఛాతీపై పిడి గుద్దులు కురిపించడంతోనే చనిపోయిందని నాగమ్మ కూతురు సునీత ఆరోపణలు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News