Monday, April 29, 2024

డబుల్ బెడ్‌రూమ్ పేరుతో మోసం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తక్కువ ధరకు డబుల్ బెడ్‌రూమ్ ఇప్పిస్తానని లక్షలాది రూపాయలు తీసుకుని మోసం చేసిన సంఘటన సికింద్రాబాద్ అడ్డగుట్టలో వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం…అడ్డగుట్టకు చెందిన మహిళకు వెంకటాచారి, సాగర్ పరిచయమయ్యారు. మారేడ్‌పల్లిలోని డబుల్ బెడ్‌రూమ్ ఇంటిని తక్కువ ధరకు ఇప్పిస్తామని చెప్పారు.

వారి మాటలు నమ్మిన బాధితురాలు దశల వారీగా వారికి రూ.7లక్షలు ఇచ్చింది. డబ్బులు ఇచ్చి చాలా రోజులు అవుతున్నా కూడా ఇంటిని ఇప్పించకపోవడంతో పాటు నిందితుల ఫోన్లు స్విచ్ ఆఫ్ వచ్చాయి. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు తుకారాంగేట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News