Thursday, May 16, 2024

నీటి కాలువలను త్వరగా పూర్తి చేయాలి

- Advertisement -
- Advertisement -

నల్గొండ : వర్షపు నీటి కాలువలను త్వరగా పూర్తి చేయాలిని మున్సిపల్ కమిషనర్ డాక్టర్ కె.వి రమణాచారి అన్నారు. శుక్రవారం నల్గొండ పట్టణంలో వార్డ్ నెంబర్ 5 లో గల మహిళా ప్రాంగణం ప్రాంతంలో మరియు వార్డ్ నెంబర్ 25 సూర్య వంశీ కాలనీ మరియు వార్డ్ నెంబర్ 32 రాక్ హిల్స్ కాలనీలో గల నూతనంగా నిర్మిస్తున్న వర్షపు నీటి కాల్వల పనులను మున్సిపల్ కమిషనర్ రమణాచారి పరిశీలించారు.

కాల్వల పనులు త్వరగా పూర్తి చేయాలని వర్షాలు రాకముందే నాణ్యతతో పూర్తి చేయమని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత కాంట్రాక్టర్ కి మరియు ఇంజనీర్లను ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తో పాటు సంబంధిత వార్డు కౌన్సిలర్లుగణేష్, ధనలక్ష్మి శ్రీనివాస్ మరియు బుర్రి శ్రీనివాస్ రెడ్డి , సంబంధిత కాంట్రాక్టర్ , మున్సిపల్ ఇంజనీర్ బి రాములు, మున్సిపల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి. అశోక్, బి. వెంకన్న, ఎన్. నరసింహ రెడ్డి , మున్సిపల్ ఏఈ దిలీప్, రవీందర్, ప్రవీణ్, మరియు సానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గులాం ముర్తుజా మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News