Tuesday, April 30, 2024

రేపట్నుంచి విద్యాసంస్థలు బంద్

- Advertisement -
- Advertisement -

Telangana Schools will be closed from tomorrow

హైదరాబాద్ : కరోనా మహమ్మారి మరోసారి విస్తరిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలను మరోసారి తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయించింది. విద్యాసంస్థల్లో రోజురోజుకు కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అసెంబ్లీ సమావేశాల్లో మంగళవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారికంగా ఒక ప్రకటన చేశారు. ఈ నిబంధనలు బుధవారం నుంచి అమలు కానున్నాయని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్రంలోని వైద్య కళాశాలలు మినహాయించి, అన్ని హాస్టళ్లు, గురుకుల విద్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలన్నింటికీ ఈ నిబంధనలు వర్తిస్తాయని ఆమె స్పష్టం చేశారు. అయితే విద్యార్థులకు గతంలో నిర్వహించిన మాదిరిగానే ఆన్‌లైన్ శిక్షణా తరగతులు యథావిధిగా కొనసాగుతాయని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

దేశంలో మరోమారు శరవేగంగా కరోనా వ్యాప్తి చెందుతున్నాయన్నారు. మన పొరుగు రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి కనిపిస్తోందన్నారు. అలాగే మన రాష్ట్రంలోని విద్యా సంస్థల్లోనూ చెదురుముదురుగా కరోనా కేసులు నమోదు వుతున్నాయన్నారు. విద్యా సంస్థల్లో బోధన, బోధనేతర కార్యక్రమాలు సామూహికంగా జరుగుతాయని, ఈ నేపథ్యంలో కరోనా విస్ఫోటకంగా మారే ప్రమాదం ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నదన్నారు. ఇప్పటికే ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు, గుజరాత్, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల ప్రభుత్వాలు విద్యా సంస్థలను మూసివేశాయని ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి గుర్తు చేశారు. మన రాష్ట్రంలోనూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కరోనా వ్యాప్తి విషయంపై ఆందోళన వ్యక్తమవుతున్నదన్నారు.

విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయాలని వారినుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తులు కూడా వస్తున్నాయన్నారు. ఈ పరిస్థితులను సంపూర్ణంగా సమీక్షించిన మీదట విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, తల్లిదండ్రుల విజ్ఞప్తుల మేరకు రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టడం కోసం ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలన్నింటినీ తాత్కాలికంగా మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదన్నారు. ఈ మూసివేత ఆదేశాలు రాష్ట్ర ప్రజానీకం అందరూ ప్రభుత్వం కరోనా కట్టడి కోసం తీసుకుంటున్న చర్యలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే విధిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, శానిటైజేషన్ తదితర జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని ఆమె కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News