- Advertisement -
పుణే: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో భాగంగా తొలి వన్డేలో భారత్ 38.1 ఓవర్లలో నాలుగో వికెట్ కోల్పోయి 197 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. శిఖర్ ధావన్ 98 పరుగులు చేసి ఔటయ్యాడు. రోహిత్ శర్మ 28 పరుగులు చేసి స్టోక్స్ బౌలింగ్ లో బట్లర్ కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేసి వుడ్ బౌలింగ్లో మోయిన్ అలీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. శ్రేయస్ అయ్యర్ ఆరు పరుగులు చేసి మార్క్ వుడ్ బౌలింగ్ లో లివింగ్ స్టోన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో హార్థిక్ పాండ్యా(00), కెఎల్ రాహుల్ (06) బ్యాటింగ్ చేస్తున్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్ వుడ్, బెన్ స్టోక్స్ చెరో రెండు వికెట్లు తీశారు.
- Advertisement -