- Advertisement -
జైపూర్: నిర్మాణంలో ఉన్న భవనం గోడ కూలి ఎనిమిది మంది మృతి చెందిన సంఘటన రాజస్థాన్ రాష్ట్రం జోధ్ పూర్ లోని బస్ని పారిశ్రామిక ప్రాంతంలో జరిగింది. మంగళ వారం రాత్రి సమయంలో గోడ కూలడంలో ఎనిమిది మంది ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానికంగా ఉన్న మాథూర్ దాస్, ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై రాజస్థాన్ ముఖ్యమంత్రి ఆశోక్ గెహ్లాట్ స్పందించారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ఇస్తామని ప్రకటించారు. గాయపడిన వారికి రూ.40 వేలు పరిహారం ఇస్తామని పేర్కొన్నారు.
- Advertisement -