Saturday, May 4, 2024

పుదుచ్చేరి అసెంబ్లీ స్పీకర్‌గా ఎంబళం సెల్వం ఏకగ్రీవం!

- Advertisement -
- Advertisement -

Embalam Selvam as Puducherry Assembly Speaker!

 

పుదుచ్చేరి: పుదుచ్చేరి అసెంబ్లీ స్పీకర్‌గా బిజెపి శాసనసభ్యుడు ఎంబళం ఆర్ సెల్వం బుధవారం ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. బుధవారం అసెంబ్లీలో జరగనున్న స్పీకర్ ఎన్నికకు సంబంధించి సెల్వం నామినేషన్ మాత్రమే అందిందని అసెంబ్లీ కార్యదర్శి ఆర్ మౌనిస్వామి మంగళవారం తెలిపారు. నామినేషన్ పత్రాల సమర్పణకు మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ముగియగా సెల్వం నామినేషన్ ఒక్కటే దాఖలైందని ఆయన చెప్పారు. కొత్తగా ఏర్పడిన పుదుచ్చేరి అసెంబ్లీ మొదటిసారి బుధవారం సమావేశం కానున్నది. సెల్వం స్వగ్రామం ఎంబళం కావడంతో ఆయన ఎంబళం సెల్వంగా ప్రసిద్ధులు. 57 ఏళ్ల సెల్వం మొదటిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News