Saturday, May 4, 2024

దంతెవాడలో ఇద్దరు మహిళా నక్సల్స్ ఎన్‌కౌంటర్

- Advertisement -
- Advertisement -

Encounter of two women Naxals in Dantewada

 

దంతెవాడ: ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో శనివారం భద్రతా దళాల ఎదురుకాల్పులలో ఇద్దరు మహిళా నక్సల్స్ మరణించారు. వీరిద్దరిపై కలిపి రూ. 6 లక్షల రివార్డు ఉందని జిల్లా ఎస్‌పి అభిషేక్ పల్లవ తెలిపారు. అరన్‌పూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని గోండెరాస్ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో జిల్లా రిజర్వ్ గార్డు బృందానికి, నక్సల్స్‌కు మధ్య కాల్పుల పోరు జరిగిందని ఆయన చెప్పారు. కాల్పుల అనంతరం ఆ ప్రాంతంలో ఇద్దరు మహిళా నక్సల్స్ మృతదేహాలు లభించాయని, వారిని హిడ్మె కొహ్రమె, పొజ్జెగా గుర్తించినట్లు ఎస్‌పి తెలిపారు. వారిద్దరిపై రూ. 5 లక్షలు, రూ 1 లక్ష చొప్పున నగదు బహుమతి ఉందని ఆయన తెలిపారు. సంఘటన స్థలం నుంచి తుపాకులు, మందుగుండు సామగ్రి, కమ్యూనికేషన్ పరికరాలు, పేలుడు పదార్థాలు, టెంట్లు లభించాయని ఆయన వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News