Tuesday, April 30, 2024

రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్..

- Advertisement -
- Advertisement -

England lose 2nd wicket in 2nd T20 against IND

అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో ఇంగ్లండ్ జట్టు రెండు కీలక వికెట్లు కోల్పోయింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ జట్టుకు శుభారంభం దక్కలేదు. భారత్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అద్భుత బంతితో ఓపెనర్ బట్లర్ ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన డేవిడ్ మలాన్ తో కలిసి మరో ఓపెనర్ జాసన్ రాయ్ దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. ఈ క్రమంలో భారీ షాట్ యత్నించిన మలాన్, చాహల్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో 8.2 ఓవర్లలో 64 పరుగులు వద్ద ఇంగ్లండ్ జట్టు రెండో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టు 10 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది. క్రీజులో రాయ్(44), బెయిర్ స్టో(5)లు ఉన్నారు.

England lost 2nd wicket at 64 against India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News