Tuesday, April 30, 2024

నాలుగో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్

- Advertisement -
- Advertisement -

రాజ్‌కోట్: భారత్ -ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్ నాలుగో రోజు టీమిండియా 17 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 41 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇప్పటివరకు భారత జట్టు 516 పరుగుల ఆధిక్యంలో ఉంది. 41 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఇంగ్లాండ్ జట్టు పడింది. బెన్ డకెట్ నాలుగు పరుగులు చేసి రనౌట్‌గా వెనుదిరిగాడు. జాక్ క్రాలే 11 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్‌లో ఎల్‌బిడబ్లు రూపంలో ఔటయ్యాడు. ఓలీ పోప్ మూడు పరుగులు చేసి రవీంద్రజడేజా బౌలింగ్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. జానీ బయిర్‌స్టో నాలుగు పరుగులు చేసి రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఎల్‌బిడబ్లు రూపంలో ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో జోయ్ రూట్(6), బెన్ స్టోక్స్(7) పరుగులు చేశారు.

టీమిండియా తొలి ఇన్నింగ్స్: 445
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 319
టీమిండియా రెండో ఇన్నింగ్స్: 430/4

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News