Sunday, May 5, 2024

ఏడో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ నాలుగో రోజు ఇంగ్లాండ్ 90 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 369 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు ఇంగ్లాండ్ 179 పరుగుల ఆధిక్యంలో ఉంది. రెహాన్ అహ్మద్ 28 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్ లో శ్రీకర్ భరత్ కు క్యాచ్ ఇచ్చి ఏడో వికెట్ రూపంలో ఔటయ్యాడు. ఓలీ పోప్ డబుల్ సెంచరీ దిశగా పరుగులు తీస్తున్నాడు. ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్లు బెన్ డక్కెట్(47), బెన్ ఫోక్స్(34), టాక్ క్లాలే(31), రెహాన్ అహ్మద్(28), జానీ బైస్ట్రో(10), జోయ్ రూట్(02), బెన్ స్టోక్స్(06) పరుగులు చేసి మైదానం వీడారు. ప్రస్తుతం క్రీజులో ఓలీపోప్(169), టామ్ హార్ట్ లే(08) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. టీమిండియా బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు, రవిచంద్రన్ అశ్విన్ రెండు వికెట్లు, అక్షర పటేల్, రవీంద్ర జడేజా చెరో ఒక వికెట్ తీశారు.

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 246

భారత్ తొలి ఇన్నింగ్స్: 436

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News