- Advertisement -
సంగారెడ్డి: తెలంగాణ వ్యాప్తంగా అడవుల్లో 20 లక్షల ఎకరాల్లో మొక్కలు నాటుతున్నామని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఆందోల్ మండలం జోగిపేటలోని బృందావన్కాలనీలో హరితహారంలో భాగంగా మంత్రి హరీష్ రావు, ఎంపి బిబి పాటిల్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా హరీష్ మీడియాతో మాట్లాడారు. ఆందోల్ జోగిపేట్ మున్సిపల్ పరిధిలోని లక్షన్నర మొక్కలు నాటడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఇంటికి ఆరు మొక్కలను పంపిణీ చేస్తామని వెల్లడించారు. నాటిన మొక్కలను సంరక్షించుకోవడం మన బాధ్యత అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్ఎ క్రాంతి కిరణ్, జడ్పి చైరపర్సన్ మంజుశ్రీ పాల్గొన్నారు.
- Advertisement -