Saturday, April 27, 2024

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ప్రతిఒక్కరూ కోరుకుంటున్నారు

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ పార్టీకి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా మద్దతు తెలపడం సంతోషం

మనతెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ప్రతిఒక్కరూ కోరుకుంటున్నారని, అందులో భాగంగానే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్ధతు పలికిందని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. గాంధీభవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఏఐసిసి మీడియా ఇంచార్జ్ అజయ్‌కుమార్, మాజీ ఎంపి వి. హనుమంతరావు, ఎన్‌ఆర్‌ఐ సెల్ చైర్మన్ వినోద్‌కుమార్, ఆర్‌పిఐ అధ్యక్షుడు మహేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ప్రజలే నిర్ణయించుకున్నా రన్నారు. ఏ సర్వే చూసినా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని వారు జోస్యం చెప్పారు. ఈశ్వరీబాయ్ పెట్టిన పార్టీ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రజలు కోరుకున్న బంగారు తెలంగాణ కాంగ్రెస్‌తోనే సాధ్యమని కాంగ్రెస్‌కు భేషరతుగా మద్ధతుగా తెలిపారన్నారు. నేటి నుంచి విహెచ్ ప్రచారం చేస్తున్నారని, అయన స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నారన్నారు. నిజమైన కాంగ్రెస్ వాడి హనుమంతరావు అని వారు తెలిపారు. ఇందిరాగాంధీ హయాంలోనే దేశ అభివృద్ధి జరిగిందన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీ పథకాలతో ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. మహాలక్ష్మి ద్వారా రూ. 2500 ఆర్థిక సాయం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎంతగానో ఉపగపడుతుందన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News