Friday, April 26, 2024

విశాఖలో నోట్ల మార్పిడి పేరుతో టోకరా

- Advertisement -
- Advertisement -

అమరావతి: విశాఖపట్నంలో నోట్ల మార్పిడి పేరుతో టోకరా జరిగింది. కమీషన్ ఆశ చూపి రూ.12 లక్షలతో ముఠా ఉడాయించింది. రూ.2వేల నోట్లకు పది శాతం కమీషన్‌తో రూ.500 నోట్లు ఇస్తామని మోసం చేసింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మహిళతో ఈ మఠా ట్రాప్ చేయించి తప్పించుకుంది. అసలు నోట్ల స్థానంలో దుండగులు నకిలీ నోట్లు పెట్టడంతోనే మోసపోయారు. పోలీస్ స్టేషన్‌లో బాధితుడు ఫిర్యాదు చేయడంతో ముఠా కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Also Read: అతడికి 65… ఆమెకు 16… అత్తకు పదోన్నతి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News