పోలీసులకు బాధితుల విన్నపం
మనతెలంగాణ, హైదరాబాద్ : ఫైనాన్సర్ బారి నుంచి తమ కుటుంబాన్ని కాపాడాలని ఓ బాధితు కుటుంబం పోలీసులను వేడుకుంటోంది. మీడియా సమావేశంలో ఆదివారం మాట్లాడుతూ మల్కాజ్గిరికి చెందిన నిజాంపేట సాయికుమార్ తాము ఫైనాన్సర్ సంతోష్కుమార్ వద్ద తన తండ్రి బిక్షపతి ఏడాది క్రితం ఇంటి పేపర్లు పెట్టి రూ.5లక్షలు అప్పు తీసుకున్నాడు. ముందుగానే రూ.50 వేలు వడ్డీ తీసుకున్నాడు. అప్పుడే ఛత్రినాకకు చెందిన శ్రీనివాస్ మీకు ఇల్లు కట్టుకునేందుకు బ్యాంక్ రుణం ఇప్పిస్తాడని చెప్పి తమకు ఇచ్చిన డబ్బుల్లో నుంచి రూ.2లక్షలు ఇప్పించాడని తెలిపాడు. దీంతో తమకు కేవలం రూ.2లక్షలు మాత్రమే అందాయని తెలిపారు. అప్పు కింద తమ వద్ద ప్రతి నెల 10శాతం వడ్డీ తీసుకునే సంతోష్ తమ ఇంటిపై కన్ను వేశాడని, తనకు రూ.12లక్షలు ఇస్తేనే ఇంటి కాగితాలు ఇస్తానని బెదిరిస్తున్నాడని చెప్పారు. సంతోష్కుమార్ బెదిరింపులకు తాళలేక తన తండ్రి ఆరు నెలల క్రితం మృతిచెందాడని చెప్పాడు. సంతోష్ నుంచి తమ కుటుంబాన్ని రక్షించాలని పోలీసులను కోరాడు.