- Advertisement -
కాబుల్: ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబుల్లోని మసీదు బయట ఆదివారం భారీ పేలుడు సంభవించి పలువురు చనిపోయారని తాలిబన్ సీనియర్ అధికారి తెలిపారు. ఆ పేలుడు సంఘటన ఈద్గా మసీదు ఎంట్రెన్స్ వద్ద సంభవించిందని తాలిబన్ ప్రతినిధి జబీవుల్లాహ్ ముజాహిద్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.
“ఈద్గా మసీదు వద్ద పేలుడు శబ్దం వినిపించింది. దాని తర్వాత కాల్పుల శబ్దాలు వినిపించాయి” అని అక్కడి సమీప దుకాణుదారుడు అహ్మదుల్లాహ్ తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు. కానీ ఈ పేలుళ్లకు పాల్పడింది ఎవరనే విషయం ఇంకా తెలియరాలేదు. అయితే తాలిబన్ ప్రతినిధి జబీవుల్లాహ్ ముజాహిద్ తన తల్లి స్మారక సభ నిర్వహిస్తున్న సందర్భంగా మసీదును లక్షంగా చేసుకుని ఈ దాడి జరిగిందన్నది స్పష్టం.
- Advertisement -