Monday, April 29, 2024

అధునాతన మిల్లులతో రైతులకు రాబడి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్:రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయాభివృద్ధి కార్యాచరణ ద్వారా ఇప్పటికే 3 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి సాధిస్తూ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ స్థాయికి చేరుకున్నదని సిఎం కెసిఆర్ అన్నారు. అందుబాటులోకి వచ్చిన గౌర వెల్లి, మల్కపేట, బస్వాపూర్ తదితర ప్రాజెక్టులు సహా మరి కొద్దిరోజుల్లో పూర్తికా నున్న పాలమూరురంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుతో రాష్ట్రంలో వరిధాన్యం దిగు బడి మరో కోటి టన్నులకు పెరిగి 4 కోట్ల టన్నులకు చేరుకునే అవకాశాలు ఉన్నా యని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఫుడ్ ప్రాసెస్ కంపెనీలను స్థాపించాలని నిర్ణ యించామని, ఇందులో భాగంగా మిల్లింగ్ కెపాసిటీని పెంచే దిశగా రాష్ట్రంలో కొన సాగుతున్న మిల్లులకు అధనంగా మరిన్ని అధునాతన రైస్ మిల్లులను అందుబాటు లోకి తెచ్చి రాష్ట్ర వ్యవసాయాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని పునరుద్ఘాటించా రు. అదే సందర్భంలో రాష్ట్రంలో నిల్వ ఉన్న 1 కోటి 10 లక్షల టన్నుల వరిధాన్యం,

4 లక్షల టన్నుల బియ్యాన్ని తీసుకోకుండా ఎఫ్‌సిఐ పలు రకాలుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెడుతున్నదని, ఈ పంట ఇట్లా వుంటే అధనంగా మరింత వరి ధాన్యం దిగబడి కానున్న పరిస్థితుల్లో రైతు పండించిన వరి పంటను పలు రకాల ఆహార ఉత్పత్తులుగా మలిచి, ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు ఎగుమతి చేసి, రైతుకు మరింత లాభం చేకూరే విధంగా చర్యలు చేపట్టాలని సిఎం కెసిఆర్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ రైతు సంక్షేమాన్ని దృష్టిలో వుంచుకుని, వ్యవసాయ విధానాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. అందులో భాగంగానే ప్రస్థుతమున్న రైస్ మిల్లులు యధా విధిగా కొనసాగుతూనే, అధునాతన మిల్లులు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను స్థాపించే దిశగా కార్యాచరణ చేపడుతామని సిఎం కెసిఆర్ పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో ప్రస్థుతం వున్న రైస్ మిల్లుల సామర్థ్యం కోటి టన్నుల వరకు మాత్రమే ఉన్నదన్నారు. మరో రెండు కోట్ల టన్నుల వరిధాన్యాన్ని మిల్లింగ్ చేసే దిశగా మిల్లులను ఏర్పాటు చేయాలన్నారు.

ఈ నేపథ్యంలో అధనంగా పండుతున్న ధాన్యాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ చేయడానికి తగ్గట్టుగా అధునాత రైస్ మిల్లులను ఏర్పాటు చేయాలని సిఎం అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి విధి విధానాల ఖరారు కోసం కమిటీని సిఎం ప్రకటించారు. ఆర్థిక శాక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధ్యక్షులుగా, సిఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, ఐటి ఇండస్ట్రీస్ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్,సివిల్ సప్లయ్స్ కార్పోరేషన్ చైర్మన్ అనిల్ కుమార్, టిఎస్ ఐఐసి ఎండీ నర్సింహారెడ్డి సభ్యులుగా కొనసాగుతారు. ఇందుకు సంబంధించి., శుక్రవారం నాడు డా.బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సిఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, జగదీశ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎంపి దామోదర్ రావు, రైతు బంధు సమితి అధ్యక్షుడు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సిఎం ఓ అధికారులు,

నర్సింగ్ రావు, భూపాల్ రెడ్డి, ఆర్థిక శాక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సిఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, ఐటి ఇండస్ట్రీస్ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, ఎం ఏ యూ డీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, సివిల్ సప్లయ్స్ కార్పోరేషన్ చైర్మన్ అనిల్ కుమార్, టిఎస్ ఐఐసి ఎండీ నర్సింహారెడ్డి , వారితో పాటు, అంతర్జాతీయ రైస్ మిల్లు తయారీ కంపెనీ సటాకే’ ఇండియా డైరక్టర్ ఆర్. కె.బజాజ్ తదితర ప్రతినిధులు సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ “పంటకు పెట్టుబడి అందించడం నుంచి ధాన్యాన్ని గిట్టుబాటు ధర చెల్లించి కొనేదాకాదేశంలో మరే రాష్ట్రం చేపట్టని విధంగా రైతు సంక్షేమాన్ని కొనసాగిస్తూ, వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తున్నం. ఇవ్వాల తెలంగాణ పచ్చబడ్డది. విపరీతంగా పంట దిగుబడి పెరిగింది. రైతు కుటుంబాలు సంతోషంగా వున్నాయి.

ఇంకా వారి సంక్షేమం కోసం ఫుడ్ ప్రాసెస్ యూనిట్లను ఏర్పాటు చేసి ఇతర రాష్ట్రాలకు, దేశాలకు వరి ధాన్యం ఉత్పత్తులు ఎగుమతయ్యేలా చూడాలి. అప్పడు తెలంగాణ వరికి గిరాకీ పెరిగి రైతు లాభాలు గడిస్తారు. అధనంగా పండే పంటను దృష్టిలో వుంచుకుని మాత్రమే నూతనంగా అధునాతన మిల్లులు ఏర్పాటు చేయబోతున్నాం. ఇందు కోసం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసి విధి విధానాలు ఖరారు చేసి కార్యాచరణ ప్రారంభించనున్నాం. అంతర్జాతీయ స్థాయిలో పేరున్న సటాకె’ వంటి కంపెనీలతో చర్చించినం. వారితో రేపటినుంచే కమిటీ చర్చలు జరపి ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని ఆదేశించినం” అని సిఎం కెసిఆర్ అన్నారు. తెలంగాణ రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధమ ప్రాధాన్యతని సిఎం కెసిఆర్ పునరుద్ఘాటించారు.

వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి:
రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గోదావరి లో వరదల పరిస్థితిచ, భద్రాచలం వద్ద ముంపు పరిస్థితి పై సిఎం కేసీఆర్ ఆరా తీసారు. ప్రాణహిత తదితర నదుల ద్వారా కాళేశ్వరం తదితర ప్రాజెక్టుల్లో చేరుతున్న వరద గురించి సిఎం ఆరా తీసారు. కాగా పరిస్థితులను ఎప్పటికప్పడు పర్యవేక్షిస్తున్నామని, పరిస్థితులు అదుపులోనే వున్నాయని, భద్రాచలం వద్ద వరదను అంచనా వేస్తూ ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా వుంటూ సహాయక చర్యల కోసం సిద్దంగా వున్నదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సిఎం కెసిఆర్‌కు వివరించారు. రేపు, ఎల్లుండి కూడా భారీ వర్షాలున్నాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా వుండాలని సిఎం ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News